'రోగ్' ఎవరో తేల్చేశాడు

'రోగ్' ఎవరో తేల్చేశాడు - Sakshi


జెట్ స్పీడ్తో సినిమాలు పూర్తి చేసే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అదే స్పీడు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం వరణ్తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న పూరి, ఆ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ సినిమాను ప్రకటించేశాడు. చాలా రోజులుగా చిరంజీవి 150 సినిమా విషయంలో క్లారిటీ కోసం ఎదురుచూసిన పూరి ఆ సినిమా ఎంతకీ ఫైనల్ కాకపోవటంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టిపెట్టాడు.



చిరు సినిమాతో పాటు మహేష్తో కూడా ఓ సినిమా చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు పూరి. అంతేకాదు ఈ సినిమాకు 'రోగ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. 'పోకిరి' సీక్వల్గా ఈ సినిమా తెరకెక్కనుందని అప్పట్లో భారీ చర్చ జరిగింది. అయితే ఈ గాసిప్స్ అన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ, తన నెక్ట్స్ సినిమాను స్వయంగా ప్రకటించాడు పూరి.



ఇప్పటికే తన ట్విట్టర్ లో తన నెక్ట్స్ సినిమా టైటిల్ తో పాటు హీరోను కూడా ఎనౌన్స్చేశాడు. 'రోగ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు పూరి జగన్నాథ్. తెలుగులో మహాత్మ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించిన కన్నడ నిర్మాత, నటుడు సిఆర్ మనోహర్ తనయుడే ఈ ఇషాన్. గతంలో 'చిరుత' సినిమాతో రామ్చరణ్ను  గ్రాండ్గా లాంచ్ చేసిన పూరి చాలా కాలం తరువాత మరో స్టార్ వారసున్ని వెండితెరకు పరిచయం చేస్తున్నాడు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top