సినీ నిర్మాత వికాస్ మోహన్ మృతి
ముంబై: హిందీ సినీ నిర్మాత, ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ వికాస్ మోహన్ కన్నుమూశారు. సిటీ కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మరణించారు. ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అక్షయ్ కుమార్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ఆర్జూ(1999) సినిమాను ఆయన నిర్మించారు. లిబాస్(1988) చిత్రానికీ నిర్మాతగా వ్యవహరించారు. పలు చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించారు. వికాస్ మోహన్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.