ప్రేమకథా చిత్రమ్ 50 రోజుల పండగ
సుధీర్బాబు, నందిత జంటగా మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె. ప్రభాకర్రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’. మారుతి సమర్పణలో సుదర్శన్రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం 53 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు, ఈ సక్సెస్ని అందించిన మారుతికి నిర్మాత ధన్యవాదాలు తెలియజేశారు.
దర్శకుడిగా నా మొదటి సినిమా యాభై రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని ప్రభాకర్రెడ్డి చెప్పారు. ఈ చిత్రంలో చేసిన పాత్ర తన కెరీర్కి మంచి మలుపయ్యిందని సప్తగిరి తెలిపారు. మారుతి మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా బాగా రావడానికి యూనిట్ మొత్తం కారణం. ఓ దర్శకుణ్ణి వరుసగా విజయాలు వరిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోంది.
ప్రస్తుతం చేస్తున్న ‘కొత్త జంట’ చిత్రం కూడా వినోదం, వైవిధ్యం కలగలిపిన కథాంశంతో రూపొందుతున్నదే. ఆగస్ట్ 2న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ మొదలవుతుంది. సమాజంలో పేరుకుపోయిన స్వార్థం నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది’’ అన్నారు.