అతడి కోసం రూ.2 కోట్ల అదనపు ఖర్చు!

అతడి కోసం రూ.2 కోట్ల అదనపు ఖర్చు!


విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. ఆయన తమ సినిమాలో నటించాలని కోరుకుని హీరోలు అరుదు. హీరో రామ్చరణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రకాశ్రాజ్ కోసం అదనంగా రూ. 2 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు చెర్రీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.

 


చరణ్ తాజాగా నటించిన 'గోవిందు అందరివాడేలే'లో తాత పాత్రకు ముందుగా రాజ్కిరణ్ ను తీసుకున్నారు. చిత్రీకరణ్ సమయంలో సంతృప్తి కలగకపోవడంతో రాజ్కిరణ్ ను తీసేసి ఆయన స్థానంలో ప్రకాశ్రాజ్ను తీసుకున్నారు. ఇందుకోసం రూ. 2 కోట్లు అదనంగా ఖర్చయిందని చరణ్ వెల్లడించాడు. అయితే రూ. పదికోట్లకు సమానంగా ప్రయోజనం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. చెర్రీ నమ్మకం నిజమవుతుందో, లేదో ప్రేక్షకులే తేల్చాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top