ప్రభాస్ మొదలెట్టేశాడు..!

ప్రభాస్ మొదలెట్టేశాడు..!


బాహుబలి 2 రిలీజ్ తరువాత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. బాహుబలి రిలీజ్ ముందే సెట్ అయిన సాహో సినిమా యూనిట్ తో జాయిన్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్నా.. ఆ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనలేదు. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు బాహుబలికే అంకితమయిన ప్రభాస్, సాహో సెట్స్ లో సందడి చేస్తున్నాడు.



స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి షూటింగ్ కు హాజరైన ఆ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ లో వెల్లడించారు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top