అది వాళ‍్ల పర్సనల్‌: పోసాని కృష్ణమురళీ

‘టాలీవుడ్‌నే టార్గెట్‌ చేశారనడం సరికాదు’ - Sakshi


హైదరాబాద్‌ :  డ్రగ్స్‌ మాఫియా కేసులో  చిత్ర పరిశ్రమనే టార్గెట్‌ చేశారనడం సరికాదని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఈ కేసులో సిట్‌ అదికారులు అందరినీ విచారణ చేస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. అందులో భాగంగానే సినీ నటులు విచారణకు హాజరవుతున్నారని పోసాని తెలిపారు. అయితే విచారణకు హాజరైన వారిలో కొందరు బ్లడ్‌ శాంపిల్స్‌ ఎందుకు ఇవ్వడం లేదనేది వాళ్ల వ్యక్తిగత విషయమన్నారు. అదే తనను అడిగితే స్వచ్ఛందంగా బ్లడ్‌ శాంపిల్‌ ఇస్తానని, ప్రభుత్వం సిగరెట్లు, మద్యాన్ని నిషేధించాలని పోసాని విజ్ఞప్తి చేశారు.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top