ఆమీర్ ఖాన్ 'పీకే'కు తొలిరోజు భారీ వసూళ్లు

ఆమీర్ ఖాన్ 'పీకే'కు తొలిరోజు భారీ వసూళ్లు - Sakshi


ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం 'పీకే' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. భారత్లోనే 26.63 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ చిత్రానికి తొలిరోజే హిట్ టాక్ వచ్చింది. దీంతో వీకెండ్స్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ సినిమా వసూళ్లు ఓవరాల్గా 300 కోట్ల రూపాయల మార్క్ను చేరుకోవచ్చని చెబుతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో విధు వినోద్‌చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆమీర్ సరసన అనుష్క శర్మ నటించారు. గత శీతాకాలంలో విడుదలయిన ఆమీర్ సినిమా 'ధూమ్-3' కూడా భారీ వసూళ్లు సాధించింది.





 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top