అక్టోబర్‌లో గుర్రం ఎక్కుతాడు

అక్టోబర్‌లో గుర్రం ఎక్కుతాడు - Sakshi


 పవన్‌కల్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీ. తన కెరీర్‌లో ఇప్పటివరకూ పోషించనటువంటి ఓ కొత్త డైమన్షన్ ఉన్న పాత్రను ఆయన ‘గోపాల గోపాల’ చిత్రంలో పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్రపైనే ప్రస్తుతం పవర్‌స్టార్ దృష్టి అంతా. ఆహార్యం, వాచకం, హావభావాలు... ఇలా అన్నీ కృష్ణునికి తగ్గట్టు పెక్యులర్‌గా ఉండేలా చూసుకుంటున్నారాయన. అందుకే... ఓ రెండు నెలల పాటు మరో సినిమా గురించి ఆలోచించే పరిస్థితిలో పవన్‌కల్యాణ్ లేరు.

 

 అయితే... మరి ‘గబ్బర్‌సింగ్-2’ పరిస్థితేంటి? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సినిమా అటకెక్కినట్టే అని కొన్ని రూమర్లు కూడా వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే... వాటన్నింటినీ చెక్ పెడుతూ... అక్టోబర్‌లో ‘గబ్బర్‌సింగ్-2’ను సెట్స్‌కి తీసుకురానున్నారు పవన్‌కల్యాణ్. ‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించిన తన వర్క్ త్వరితగతిన పూర్తి చేసి, అక్టోబర్‌లో ‘గబ్బర్‌సింగ్’ అవతారం ఎత్తనున్నారాయన. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పవన్‌కల్యాణే పర్యవేక్షిస్తున్నట్టు సమాచారమ్. అంటే... రానున్న రోజుల్లో పవర్‌స్టార్‌ని రెండు భిన్నమైన కోణాల్లో అభిమానులు చూడబోతున్నారన్నమాట.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top