పూరి జగన్నాథ్ కు ఎన్టీఆర్ కానుక
డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు యంగ్ ఎన్టీఆర్ మరిచిపోలేని బహుమతి ఇచ్చాడు. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా వెల్లడించారు. ఖరీదైన కాన్సర్ట్ స్పీకర్స్(కచేరీ స్పీకర్లు) కానుకగా ఇచ్చాడని తెలిపారు. జూబ్లీహిల్స్ లో పూరి జగన్నాథ్ ఇటీవల నిర్మించుకున్న ఆఫీస్ భవనం కోసం జూనియర్ ఎన్టీఆర్ వీటిని కానుగా ఇచ్చాడు.
'నా కొత్త ఆఫీసులో పెట్టుకోవడానికి తారక్ ఖరీదైన కాన్సర్ట్ స్పీకర్స్ కానుగా పంపాడు. ఇవి చాలా బాగున్నాయి' అని పూరి జగన్నాథ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నాడు. అతడు నటించిన 'రభస' సినిమా త్వరలో విడుదల కానుంది.
సంబంధిత వార్తలు