'భారత కీర్తి పతాకాన్ని అక్కడికి తీసుకెళ్తా'

'భారత కీర్తి పతాకాన్ని అక్కడికి తీసుకెళ్తా'


న్యూఢిల్లీ : భారతీయ సినిమాల ఆస్కార్ జ్యూరీ బోర్డు చైర్మన్గా తనను నియమించడంతో కాస్త భయాందోళనకు గురైనట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ అన్నారు. భారత కీర్తి పతాకాన్ని అక్కడికి(ఆస్కార్ వేడుకలకు) తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా అత్యుత్తమ మూవీని ఎంపిక చేస్తానో లేదా, వారికి అభిరుచికి తగ్గట్టుగా జ్యూరీ సభ్యలు భారత్ తరఫున సినిమాలను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. 17 మంది సభ్యులు కల జ్యూరీ బోర్డుకి చైర్మన్గా పాలేకర్ నియామకమయ్యారు.



విదేశీ చిత్రాల విభాగానికి భారత్ తరఫున సినిమాను ఎంపిక చేసే బాధ్యత వీరిపై ఉంటుంది. ఆస్కార్ 88వ వార్షిక అవార్డుల కోసం అధికారికంగా దేశం తరఫున ఓ మూవీని అక్కడి వారికి పంపిస్తారు. 2005లో పాలేకర్ నటించిన మూవీ పహేలి భారత్ నుంచి ఎంట్రీ లభించిందని ఆయన గుర్తుచేశారు. జ్యూరీ చైర్మన్గా తనను నియమించడంలో ఎటువంటి ప్రత్యేకత లేదని పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top