'భారతరత్న'కు అర్హుడిని కాను: అమితాబ్
ముంబై: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు తాను అర్హుడిని కాదని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. తనకు భారతరత్న ఇవ్వాలన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాదనతో అమితాబ్ విబేధించారు.
కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ను అమితాబ్కు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అమితాబ్ స్థాయి వ్యక్తికి పద్మవిభూషణ్ సరిపోదని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై అమితాబ్ ట్విట్టర్లో స్పందించారు. 'మమతా జీ.. భారతరత్న అవార్డుకు నేను అర్హుడిని కాదు. దేశం నాకు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చింది' అని అమితాబ్ ట్వీట్ చేశారు. అమితాబ్ గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను స్వీకరించారు. తాజాగా అమితాబ్తో పాటు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ తదితరులకు పద్మవిభూషణ్ ప్రకటించారు.
సంబంధిత వార్తలు