ఇద్దరమ్మాయిల కథ

ఇద్దరమ్మాయిల కథ - Sakshi


సీత, దేవి అనే ఇద్దరమ్మాయిల కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘నేను సీతాదేవి’. సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి ప్రధాన పాత్రల్లో కే.శే. చిటుకుల అరుణ సమర్పణలో సందీప్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ నిర్మించిన ఈ చిత్రం ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తయింది. హీరో, నిర్మాత సందీప్ మాట్లాడుతూ -‘‘మంచి కథాంశంతో, ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో ఈ చిత్రం చేశాం. చైతన్య రాజు స్వరపరచిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.



శ్రీనివాస్ చిత్రీకరణ ప్రేక్షకులను మెప్పిస్తుంది. రణధీర్‌కు, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. త్వరలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: సునీల్ కశ్యప్, కెమేరా: శివ జీకే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top