తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్

తెలుగమ్మాయికి బాలీవుడ్ ఛాన్స్ - Sakshi


మన తెలుగు నేల మీద పుట్టి.. ఇక్కడే పెరిగిన శోభిత ధూళిపాళ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. మిస్ ఇండియా ఎర్త్ కిరీటం గెలిచిన ఈ ముద్దగుమ్మ చాలా రోజులుగా వెండితెర అరంగేట్రం కోసం ఎదురుచూస్తోంది. అయితే తెలుగు తెర మీద ఈ అమ్మడి అవకాశాలు రాకపోయినా బాలీవుడ్ మాత్రం పిలిచి మరి అవకాశం ఇచ్చింది. త్వరలోనే ఓ బాలీవుడ్ మూవీతో వెండితెర మీద దర్శనమివ్వబోతుంది శోభిత.



ఇప్పటికే ఫెమినా, మాండేట్, హై బ్లిట్జ్ లాంటి మేగజైన్ కవర్ పేజీల మీద దర్శనమిచ్చిన ఈ భామను అనురాగ్ కశ్యప్ బాలీవుడ్కు పరిచయం చేయబోతున్నాడు. వర్సటైల్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధీఖీ లీడ్ రోల్ లో నటిస్తున్న  ఓ బయోగ్రఫికల్ డ్రామలో శోభిత హీరోయిన్ గా నటిస్తోంది. సంచలనం సృష్టించిన సైకో కిల్లర్ రమణ్ రాఘవన్ జీవితకథ ఆధారంగా రాఘవ్ 2.0 పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో శోభిత వెండితెరకు పరిచయం అవుతోంది .

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top