అతిధి పాత్రలో మిచెల్లీ ఒబామా!

అతిధి పాత్రలో మిచెల్లీ ఒబామా!

అమెరికన్ మ్యూజికల్ డ్రామా సిరీస్ 'నాష్ విల్లే' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామా అతిధి పాత్రలో దర్శనివ్వనున్నారు. మే 7 తేదిన ప్రసారం కానున్న ఏబీసీ డ్రామా ఎపిసోడ్ లో యూఎస్ ప్రథమ పౌరురాలు మిచెల్లీ అతిధి పాత్రలో కనిపించనున్నారు. కోని బ్రిటన్ సరసన మిచెల్లీ నటించనున్నారని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. 

 

ఇకముందు ఇలాంటి పాత్రలు చేస్తానని అనుకోవడం లేదని, దేనికి వెనకంజ వేయడం తన నైజం కాదని మిచెల్లీ అన్నారు. ఏది మంచి అనుకుంటే దాన్ని మహిళలు స్వీకరించాలని మిచెల్లీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలోని ఓ క్యారెక్టర్ అఫ్ఘనిస్తాన్ లో గాయపడటంతో మిచెల్లీకి ఈ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఓ చారిటీ షోలో పాల్గొనాల్సిన మిచెల్లీ ఈ కార్యక్రమంలో నటించడానికి ఒప్పుకున్నారు. 

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top