మణిరత్నం చిత్రంలో కార్తీ

మణిరత్నం చిత్రంలో కార్తీ


చెన్నై: సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం తర్వాతి చిత్రంలో యువ హీరో కార్తీ నటించే అవకాశముంది. ఈ చిత్రంలో నటించేందుకు కార్తీ సుముఖత వ్యక్తం చేశారని ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. కాంట్రాక్టుపై ఇంకా సంతకం చేయాల్సి ఉందని, తర్వలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. ఇది ద్విభాషా చిత్రమని చెప్పారు.



కార్తీ తన కెరీర్ను మణిరత్నం దగ్గరే ప్రారంభించారు. 2004లో మణిరత్నం దర్శకత్వం వహించిన 'ఆయుత ఎజుతు' చిత్రానికి కార్తీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమాలో నటించే అవకాశం రాగా, కార్తీ దర్శకత్వం వైపు మొగ్గుచూపారు. మణిరత్నం తాజా  చిత్రాన్ని తమిళంతో పాటు మలయాళం భాషాల్లో నిర్మించనున్నారు. మలయాళంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top