మీడియాతో ఢీ

మీడియాతో ఢీ - Sakshi


‘‘సమాజంలో ఎవరైనా మా ముందు తలదించాల్సిందేననే ఓ మీడియా అధినేతతో మనలో ఒకడు, ఓ సామన్య అధ్యాపకుడు ఢీ అంటే ఢీ అంటూ తలపడితే.. ఏం జరిగిందనే కథతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మనలో ఒకడు’. జగన్‌మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయాలను కుంటున్నారు.



‘‘కృష్ణమూర్తిగా ఆర్పీ, మీడియా అధినేతగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది’’ అని నిర్మాత అన్నారు. ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పాటలు: చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, కెమేరా: ఎస్.జె.సిద్ధార్థ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాల సుబ్రమణ్యం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top