ఆయనతో చేయాలని ఉంది
తమిళసినిమా: లక్ష్య సాధన కోసం తపించే వారు కొందరైతే, ఎలాంటి లక్ష్యం లేకుండా విధి కనుగుణంగా నడుచుకునే వారు మరి కొందరు ఉంటారు. మరి నటి కీర్తీసురేశ్ ఏ కోవకు చెందిందో చూద్దాం. ఈ బ్యూటీ తొలి రోజుల నుంచే బహుభాషానటిగా గుర్తింపు పొందింది. తొలుత మాతృభాష మలయాళంలో, ఆ తరువాత కోలీవుడ్, ఆపై టాలీవుడ్ అంటూ అతివేగంగా ఎదిగిన నటి కీర్తీసురేశ్.
తమిళంలో విక్రమ్ప్రభుకు జంటగా కథానాయకి కెరీర్ ప్రారంభించి శివకార్తికేయన్, ధనుష్, విజయ్ అంటూ తన రేంజ్ను పెంచుకుంటూ పోతోంది. అదేవిధంగా రజనీమురుగన్, రెమో, భైరవా చిత్రాలతో విజయాల గ్రాఫ్ను పెంచుకుంటూ పోతోంది. ఇంతకీ నటిగా నీ లక్ష్యం ఏమిటమ్మా అన్న ప్రశ్నకు ఈ రంగంలోకి రాక ముందే నటినవ్ప్పుకొచ్చింది. ధనుష్, విజయ్లతో కలిసి నటించావు. ప్రస్తుతం సూర్యకువాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నానని, అది సాధించుకున్నానని చె జంటగా తానాసేర్న్ం కూటం చిత్రంలో నటిస్తున్నావు. తదుపరి లక్ష్యం అజితేనా అన్న ప్రశ్నకు అజిత్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఆయనతో నటించాలన్న కోరిక తనకూ ఉందని, అయితే అదే లక్ష్యం అని చెప్పనని అంది.
అలాంటి అవకాశం తానుగా వస్తే తప్పకుండా నటిస్తానని, అందుకోసం అని ప్రత్యేకంగా ప్రయత్నాలేని చేయనని పేర్కొంది. అసలు ఏ హీరోతో నటించాలన్న దాని గురించి తాను ఆలోచించనని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని నటిగా మంచి పేరు తెచుకోవాలన్నదే తన భావన అని కీర్తీసురేశ్ పేర్కొంది. అన్నట్లు ఈ బ్యూటీ తమిళం తెలుగు భాషల్లో మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న మహానది చిత్రంలో సావిత్రిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా పవర్స్టార్ పవన్కల్యాణ్తో ఒక చిత్రం, నాని సరసన మరో చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.