ఓ బిడ్డ తల్లిగా...

ఓ బిడ్డ తల్లిగా...


హిందీ చిత్రసీమలో నంబర్‌వన్ అందాలతార ఎవరంటే దాదాపుగా అందరూ కత్రినాకైఫ్ పేరే చెబుతారు. అందుకు తగ్గట్టుగానే ఆమె అత్యధిక శాతం గ్లామర్ పాత్రలే పోషిస్తుంటారు. ‘రాజ్‌నీతి’ సినిమా తరహాలో అప్పుడప్పుడూ ప్రయోగాత్మక పాత్రలు చేస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ‘కహానీ’ చిత్రం ద్వారా విద్యాబాలన్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సుజయ్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు.

 

 ఇందులో కత్రినా పాత్ర విభిన్నంగా ఉంటుందని వినికిడి. భర్తలేని ఒంటరి ఆడదానిగా కత్రినా కనిపించనుందట. పైగా ఇందులో ఆమె ఓ బిడ్డకు తల్లి కూడానట. జపాన్ నవల ’ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ అనే చిత్రం ఆధారంగా సుజయ్‌ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో కత్రినాకైఫ్ నటించిన భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ విభిన్న పాత్రలో కనిపిస్తే, అభిమానులు సంతృప్తి చెందుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top