ప్రాణాలతో బయటపడిన హీరోయిన్


తమిళ, తెలుగు చిత్రాల్లో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే చేసి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. అది కూడా ఎవరో కాదు.. హాలీవుడ్ నుంచి కోలీవుడ్కు దిగొచ్చిన భామ ఎమీ జాక్సన్ని. ఇటీవల 'ఐ' చిత్రంలో నటించిన ఎమీ తాజాగా మరో తమిళ చిత్రంలో నటిస్తోంది.


 


ఈ చిత్రానికి తిరుకుమారన్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో కరుణాకరన్ హాస్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను కేరళలో షూటింగ్ చేస్తున్నారు. చిత్రీకరణలో భాగంగా ఓ కొండపై బైక్ రైడింగ్ సీన్లో నటిస్తున్న ఎమీ ఒక్కసారిగా బైక్పై నుంచి జారిపడి కొండమీద నుంచి కిందపడబోయిందట. సరిగ్గా అదే సమయంలో వెనకాలే మరో బైక్పై ఉన్న కరుణాకరన్ ఆమెను ప్రాణాపాయం నుంచి తప్పించి అసలైన హీరోగా మారాడట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top