మరో అరుదైన గౌరవం

మరో అరుదైన గౌరవం - Sakshi


బాలీవుడ్  మోస్ట్ వాంటెడ్  కథానాయికల్లో కంగనా రనౌత్ ఒకరు. వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ తన దైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తోన్న కంగనాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించే ‘ఉమెన్ ఇన్ ద వరల్డ్ సమిట్’లో పాల్గొమని ఆహ్వానం అందింది. ఈ నెల 8,9న తేదీల్లో లండన్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆమె తన సక్సెస్ స్టోరీని ఈ వేదికగా పంచుకోనున్నారు. ఆ సమావేశాల్లో పాల్గొనే మొదటి బాలీవుడ్ నటిగా కంగనా రనౌత్ అవుతారు. గతేడాది హిల్లరీ క్లింటన్, ఏంజెలినా జోలీ పాల్గొన్నారు. ఈ సారి హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, క్యారీ ముల్లిగన్ లాంటి ప్రముఖ హాలీవుడ్ న టీమణులు కూడా పాల్గొననున్నారు.  

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top