'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల

'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల


హైదరాబాద్: విలక్షణ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోసర్లు విడుదలైయ్యాయి. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దీన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం. సెల్వ తదితరులు హాజరయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.



త్రిష, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో 'తూంగా వనం' టైటిట్ ఖరారు చేశారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కమల్ భార్యగా ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించే అవకాశముంది. జీబ్రాన్ సంగీతం అందించనున్నాడు. కమల్ హాసన్ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించడం ఇది నాలుగోసారి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top