జస్టిన్‌ బీబర్‌ ముంబై షో... ఒక్కో టికెట్ రూ.76,000

జస్టిన్‌ బీబర్‌ ముంబై షో... ఒక్కో టికెట్ రూ.76,000


కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్ పర్యటన కన్ఫామ్ అయ్యింది. మే 10న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఈ షోలో బీబర్ దాదాపు పది పాటలను ప్రదర్శించే అవకాశం ఉంది. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ షో టికెట్స్ కోసం ఫిబ్రవరి 22 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ధరతో ఈ టికెట్స్ను అమ్ముతున్నారు.



అంతర్జాతీయ స్థాయి వీవీఐపిలు ఈ షోకు హాజరవుతున్న నేపథ్యంలో వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీ టికెట్ ధర రూ.76000 వేలుగా నిర్ణయించారు. ఆ తరువాత వివిధ క్యాటగిరీల్లో రూ.4000 వేల వరకు టికెట్ ధరలను నిర్ణయించారు. ఇప్పటికే వీవీఐపిల కోసం కేటాయించిన టికెట్లు అమ్ముడవ్వగా మిగిలిన కేటగిరిల టికెట్లు కూడా మరికొద్ది గంటల్లోనే అమ్ముడవుతాయని భావిస్తున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్ ఈ షోకు హారవ్వనున్నారు. పర్పస్ వరల్డ్ టూర్ పేరుతో చేపట్టిన జస్టిన్ బీబర్ ఇండియా టూర్కు వైట్ ఫాక్స్ ఇండియా టీం ప్రమోటర్గా వ్యవహరిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top