జయ జానకి నాయకకు వంద థియేటర్లు పెరిగాయ్..!

జయ జానకి నాయకకు వంద థియేటర్లు పెరిగాయ్..! - Sakshi


సాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 11న విడుదలైన సినిమాల్లో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయి కూడా మంచి వసూళ్లు సాధించిన సినిమా జయ జానకి నాయక. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే తొలి వారం భారీ పోటి కారణంగా ఎక్కువగా థియేటర్లు దక్కకపోవటంతో ఇప్పుడు థియేటర్లు పెంచే పనిలో పడ్డారు నిర్మాతలు.



తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో 14 కోట్లకు పైగా వసూలు చేసి ఈ సినిమాకు తాజాగా మరో వంద థియేటర్లు పెంచారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తుండటం జయ జానకి నాయకకు కలిసోస్తోంది. ఈ వారం భారీ సినిమాలేవి విడుదల కాకపోవటంతో పాటు థియేటర్ల సంఖ్య కూడా పెరగటంతో జయ జానకి నాయకకు కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top