కేరళలో ఆటా...పాటా...

కేరళలో ఆటా...పాటా...


 ‘‘బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది’’ అంటున్నారు ఎన్టీఆర్. ఆ బలం ఏంటో? ‘జనతా గ్యారేజ్’లో చూపించనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రమిది. ఇచట అన్ని రిపేర్లు చేయబడును..అనేది ఉపశీర్షిక. సమంత, నిత్యా మీనన్ కథానాయికలు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది.

 

 ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకూ కేరళలో రొమాంటిక్ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత ఐటమ్ సాంగ్ షూట్ చేస్తారు. సారథి స్టూడియోలో ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ముస్తాబవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఆగస్టులో పాటల్ని, సెప్టెంబర్ 2న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top