ఒక్కరున్నా చాలు...

ఒక్కరున్నా చాలు...


మన తోటి వారికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ, చెడు చేయకుండా ఉంటే చాలనుకునే పరిస్థితి  ప్రస్తుతం సమాజంలో ఉంది. సాటి మనిషి బాగు కోరుకునే మనిషి ఒక్కరున్నా చాలు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హితుడు’. సుంకర మధుమురళి సమర్పణలో కేఎస్వీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్వీ తనయుడు విప్లవ్ ఈ చిత్రానికి దర్శకుడు. జగపతిబాబు, మీరానందన్ ఇందులో హీరో హీరోయిన్లు. ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ -‘‘వైవిధ్యమైన కథాకథనాలకు వాణిజ్య హంగులు జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఎన్. శివప్రసాద్, దర్శకుడు శివనాగేశ్వరరావు, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top