ఆ రూమర్లతో కలత చెందా!
ముంబై:త్వరలో భారతీయ టెలివిజన్ షోలో మెరవనున్న పాకిస్తానీ నటి మహిరా హఫీజ్ ఖాన్(30) తనకు బాలీవుడ్ నుంచి ఎటువంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేసింది. బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ తో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. బాలీవుడ్ సినిమాకు సంతకం చేసినట్లు వచ్చిన ఊహాగానాల్లో నిజం లేదన్నారు. 'నేను బాలీవుడ్ లో సినిమా కోసం ఎటువంటి సంతకం చేయలేదు. అందులో నిజం లేదు. ఆ రూమర్లు ఎక్కడ నుంచి వచ్చాయో నాకైతే తెలియదు. ఆన్ లైన్లో చూసిన ఆ వార్తతో కలత చెందాను' అంటూ మహిరా తెలిపింది.
పాకిస్తాన్ లో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న 'హంసఫర్' తో భారతీయ ప్రేక్షకులను మహిరా అలరించనుంది. ప్రస్తుతం ఆ టెలివిజన్ షో కార్యక్రమంలో తాను బిజీగా ఉన్నట్లు స్పష్టం చేసింది. తనకు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినా ఆకట్టుకునే కథ మాత్రం దొరకలేదు అంటూ మహిరా పేర్కొంది.
సంబంధిత వార్తలు