ఆ రోజు రాత్రి ఏం జరిగింది?

ఆ రోజు రాత్రి ఏం జరిగింది? - Sakshi


ఓ యథార్థ ఘటన ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మలుపు’. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తన పెద్ద కుమారుడు సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో రెండో కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘‘నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా అనుకోని మలుపులతో సాగుతుంది.



డిసెంబరు 31 రాత్రి ఏం జరిగిందనే అంశం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ‘‘ ‘రుక్మిణి’ తర్వాత నేను నిర్మించిన స్ట్రయిట్ తెలుగు చిత్రం ఇదే. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించాం’’ అని నిర్మాత తెలిపారు. నటునిగా నాకు ‘వైశాలి’ కంటే ఈ చిత్రం మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉందని హీరో ఆది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రసన్-ప్రవీణ్-శ్యామ్, కెమెరా: షణ్ముగ సుందరం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top