దేవుడా ఒక్క హత్య చేస్తా.. క్షమించు: తాప్సీ

దేవుడా ఒక్క హత్య చేస్తా.. క్షమించు: తాప్సీ


నిర్భయ హత్యకేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూపై పలువురు ప్రముఖులు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా అందరికంటే తీవ్రంగా స్పందించినది మాత్రం.. టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ. ఒకే ఒక్క హత్య చేస్తానని, అందుకు దేవుడు తనను క్షమించాలని కోరింది. ముఖేష్ ఇంటర్వ్యూను చదివి తనకు ఒక్కసారిగా మాట పడిపోయిందని, ఈ మనిషిని తాను అంత తేలిగ్గా వదిలిపెట్టేది మాత్రం లేదని స్పష్టం చేసింది.  జైలు శిక్ష నిజంగానే ఈ మగాళ్లను మారుస్తుందా అనే అనుమానం తనకు వస్తోందని చెప్పింది. ఆ మార్పు రాకపోతే, ఇంకా వాళ్లు అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది.

 

 

మరాఠీ సినిమాలు తీయడంలో బిజీగా ఉన్న రేణు దేశాయ్ కూడా నిర్భయ దోషి ముఖేష్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. 'అత్యాచారంపై మీ అభిప్రాయం ఏమిటి? రేపిస్టు తన ఇంటర్వ్యూలో చెప్పిన అంశంతో మీలో ఎంతమంది రహస్యంగా ఏకీభవిస్తారు? అత్యాచారంలో నిజంగా మహిళల తప్పు ఉంటుందా?' అంటూ సూటిగా ప్రశ్నలు సంధించింది.


సినిమాల్లో సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే వెన్నెల కిశోర్ సామాజిక బాధ్యత విషయంలో మాత్రం గట్టిగానే స్పందించాడు. రేపిస్టుకు కుర్చీవేసి కూర్చోబెట్టి.. ఇంటర్వ్యూ చేయడం నిజంగా నమ్మలేకపోతున్నానని, అతడు జైల్లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడి కంటే ఎక్కువగా గొప్పలు చెప్పుకొంటున్నాడని అన్నారు.


టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాటల కంటే భావాలతోనే ఎక్కువగా ముఖేష్ ఉదంతాన్ని ఖండించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top