మార్చి 20 నుంచి గబ్బర్సింగ్-2
తిక్క ఉన్న పోలీసోడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించి ఇండస్ట్రీ రికార్డుల్లో సరికొత్త లెక్కలు చూపించాడు. అంతేకాకుండా విలన్స్ తాట తీసేశాడు, బాక్సాఫీస్ దుమ్మురేపాడు. గబ్బర్సింగ్ అవతారమెత్తి మెగా అభిమానులకి దిల్ ఖుష్ చేశాడు. ఈ ఆరు అడుగుల బుల్లెట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించి బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకున్నాడు. ఇదే తరహాలో మరోసారి ఫ్యాన్స్ హార్ట్స్ని హైజాక్ చేసేందుకు సిద్ధమైయ్యాడు. మరోమారు అదే గెటప్తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.
గబ్బర్సింగ్-2 చిత్ర షూటింగ్ గత డిసెంబర్లోనే ప్రారంభం కావలసి ఉంది. ఏ కారణం వల్లో ప్రారంభం కాలేదు. మార్చి 20 నుంచి చిత్రం సెట్స్పైకి రానుందని ఫిల్మ్ నగర్ టాక్. పవర్ ఫేమ్ బాబీ(కె.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పవన్ మిత్రుడు శరత్మారార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో తెలుగమ్మాయి అనీషా ఆంబ్రోస్ ఫస్ట్ హీరోయిన్గా ఎంపికయింది. కథానాయిక కోసం ఆడిషన్స్ నిర్వహించి, తెలుగు చక్కగా మాట్లాడే అనిషాని ఎంపిక చేశారు. ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందు 'అలియాస్ జానకి' చిత్రంలో నటించింది. ఇక రెండో హీరోయిన్ ప్లేస్ ఓ బాలీవుడ్ హీరోయిన్కు దక్కే అవకాశం ఉందని సమాచారం.
గబ్బర్సింగ్ చిత్రానికి ఇది సీక్వెల్ కానీ కాదని, ప్రేక్షకులకు పవన్ మార్క్ వినోదాన్ని పంచే కథాంశంతో మాత్రమే ఈ చిత్రం రూపొందనున్నట్లు చిత్ర నిర్మాత శరత్ మరార్ పేర్కొన్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కథ రాయడం అభిమానులలోనే కాకుండా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గబ్బర్ సింగ్ ఎంత సెన్సేషనల్ హిట్టయిందో దానిని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసినట్లు చెబుతున్నారు. అక్టోబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.