‘సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ టీజర్ విడుదలైంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిమానుల కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు టీజర్ విడుదల చేశారు. బన్నీ డిఫెరెంట్ గెటప్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఎప్పుడు స్టైలిష్గా కనిపించే బన్నీ, ఈ సారి సాంప్రదాయబద్ధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ యువకుడిగా సినిమాలో బన్నీ కనిపించనున్నాడు.
డిఫరెంట్ లుక్, మేనరిజమ్ తో టీజర్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు. ‘ఇలా ముద్దు పెట్టెస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని’ అంటూ హీరోయిన్ ను ఉద్దేశించి బన్నీ పలికిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘సరైనోడు’ బ్లాక్ బ్లస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
సంబంధిత వార్తలు