సమంత మతం మారిందా?
చైతూతో పెళ్లి ఖరారు చేసుకున్న సమంత హిందూ మతంలోకి మారిందా? ఈ విషయానికి సంబంధించి రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున కుటుంబంలో జరిగిన ఒక ఫంక్షన్కు సమంత కూడా హాజరైంది. ఇందులో చైతన్య, సమంత ఇద్దరూ కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కపక్కనే చాప మీద కూర్చున్నారు. పక్కన నాగార్జున కూడా ఉన్నారు. మామూలుగా అయితే వీళ్లు ముగ్గురూ ఒకచోట ఉండటం పెద్ద విశేషం కాకపోయినా.. సమంత కుంకుమ బొట్టు పెట్టుకోవడంతోనే అందరూ ఆమె హిందూ మతం పుచ్చుకుందని చెబుతున్నారు.
వాళ్ల వాదనకు మరింత బలం సమకూర్చేలా వెనకాల కొందరు పురోహితులు కూడా నిలబడి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే 'ఘర్ వాప్సీ' లాంటి పూజా కార్యక్రమాల ద్వారా సమంత హైందవ మతంలోకి వచ్చేసిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ముందుగా చెన్నైలో క్రిస్టియన్ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్లో హిందూ సంప్రదాయాల ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకుంటారని కూడా అంటున్నారు. ఇందుకోసం ముందుగానే సమంత మతం మారిందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై అక్కినేని కుటుంబీకులు గానీ, సమంత గానీ ట్విట్టర్లో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.