అసలు పవన్ మాట్లాడింది తనకైనా అర్థమైందా: వర్మ

అసలు పవన్ మాట్లాడింది తనకైనా అర్థమైందా: వర్మ - Sakshi


కాపు రిజర్వేషన్ల విషయమై జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరుపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు తనిచ్చిన స్పీచ్ తనకైనా అర్థమైందా అని అనుమానంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వర్మ పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రెస్‌మీట్ పెట్టడానికి వస్తున్నప్పుడు, కారులో తన పక్కన ఉన్నవాళ్ల చెప్పుడు మాటలతో ప్రభావితమై ఆ స్పీచ్ ఇచ్చారని అన్నారు. ''కమ్మల మనస్తత్వం ఉన్న కాపుల కన్నా.. స్వచ్ఛమైన కమ్మల మనసున్న కాపులు బహు మేలు.. విశ్వదాభి రామ వినుర వేమ'' అని కూడా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా పవన్ కల్యాణ్‌కు ఓ విజ్ఞప్తి అంటూ.. ఒక్కసారి జనసేన పార్టీ స్థాపించిన సందర్భంగా మీరిచ్చిన స్పీచ్ మీకు మీరే చూసుకుని మీరే నేర్చుకోండి అంటూ విమర్శలు సంధించారు. అదే సమయంలో.. పీకే అభిమానిగా తాను వ్యక్తపరిచిన నిజాల్ని వ్యతిరేకించే ఏ పీకే ఫ్యాన్ అయినా తన దృష్టిలో నమ్మక ద్రోహి అన్నారు.



పవన్ తన జనసేన లాంచింగ్ స్పీచ్‌ని రిపీట్ మోడ్‌లో చూసి, తన అన్నయ్య కంటే దారుణంగా స్క్రూయింగ్ చేసేముందు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. పవన్ అభిమానులందరికీ ఒక విజ్ఞప్తి అని.. తాను చెప్పేదాంట్లో ఎంత నిజాయితీ ఉందో మీ అందరికీ మనసులో నిజం తెలుసు కాబట్టి.. ఆయనకు వాళ్లు కూడా చెప్పాలని కోరారు. వాస్తవం ఏమిటంటే.. కమ్మలలో కొంతమంది కాపులున్నారని, అలాగే కాపులలో కూడా కమ్మలు ఉన్నారని అన్నారు. అందుకు ఉదాహరణగా చిరంజీవిలో కల్యాణ్, కల్యాణ్‌లో చిరంజీవి ఉన్నారంటూ ముక్తాయింపు ఇచ్చారు.


 

 

 

 

 

 

 

 

 

 

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top