సినిమా చరిత్రను కబ్జా చేశారు: దాసరి
హైదరాబాద్: తెలుగు సినిమా చరిత్రను కొంతమంది కబ్జా చేశారంటూ దర్శకరత్న దాసరి నారాయణరావు ఆరోపించారు. సినిమా చరిత్రను మూసేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ధియేటర్లనే కాదు సినిమా చరిత్రను కబ్జా చేశారని, చరిత్ర రాయడానికి మహా రచయితలు అవసరమని అన్నారు. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దాసరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రఘుపతి వెంకయ్య అవార్డులో నాయుడు పేరు తొలగించారని చెప్పారు. కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి అవార్డులకు కులం పేరు అడ్డురాలేదని వ్యాఖ్యానించారు. హీరోల బ్యాడీ లాంగ్వేజ్ ను బట్టి కథలు తయారుచేయొద్దని దర్శకులకు సూచించారు.
సంబంధిత వార్తలు