చూసినోడికి...కావాల్సినంత వినోదం

చూసినోడికి...కావాల్సినంత వినోదం - Sakshi


 శివాజీ, నిత్య, లెజ్లీ త్రిపాఠీ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చూసినోడికి చూసినంత’. అనీల్ వాటుపల్లి దర్శకుడు. పి.శ్రీనివాసరావు నిర్మాత. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అతిథిగా విచ్చేసిన నటి నిషా కొఠారీ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని మరో అతిథి కోన వెంకట్‌కి అందించారు. సినిమా పరిశ్రమను నిలబెడుతున్నది చిన్న చిత్రాలే అని, తాను చిన్న సినిమాల పక్షపాతిని అని ఈ సందర్భంగా కోన వెంకట్ పేరొన్నారు. ట్రైలర్స్ బాగున్నాయని,     ఈ సినిమా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

 

 దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. చూసినవారికి కావాల్సినంత వినోదం పంచే సినిమా ఇది. పాటలు బాగా వచ్చాయి. తప్పకుండా అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు. దర్శకుడు అనిల్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనీ, మంచి పబ్లిసిటీతో జనాలకు సినిమాను చేరువ చేస్తే విజయం తథ్యమనీ శివాజీ పేర్కొన్నారు. అందరి సహకారం వల్లే సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగానని నిర్మాత చెప్పారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top