'వర్మకు పిచ్చాస్పత్రిలో చికిత్స చేయించాలి'
వంగవీటి మోహన రంగా జీవిత చరిత్రపై సినిమా తీస్తానని చెప్పిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆ సినిమాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గురించి కూడా ఉంటుందని, ఆ పాత్ర కూడా ఉంటుందని వర్మ చెప్పడమే కాంగ్రెస్ నాయకుల ఆగ్రహానికి కారణమైంది.
రాంగోపాల్ వర్మ మానసిక స్థితి సరిగా లేదని, ఆయనను వెంటనే విశాఖపట్నం మెంటల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని కోరుతూ.. మెంటల్ ఆస్పత్రి సూపరింటెండెంట్కు పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం నాడు ఓ వినతిపత్రం అందించారు.