2500 కోట్లతో భారీ పడవ కొన్న దంపతులు!

2500 కోట్లతో భారీ పడవ కొన్న దంపతులు!


హాలీవుడ్ దంపతులు బ్రాడ్ పిట్, యాంజెలీనా జోలీ ఓ విలాసవంతమైన పడవ కొన్నారు. దాని విలువ దాదాపు 2500 కోట్లు! దాన్ని మరో రెండు కోట్లు వెచ్చించి తమకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేయించుకున్నారు. విలాసవంతంగా.. నీళ్లమీద తేలియాడే ప్యాలెస్ లాంటి ఈ పడవలో అత్యద్భుతంగా ఉండే ఇటాలియన్ మార్పుల్ వాడతారు.



ఇటాలియన్ కంపెనీ రిజార్డీ ఈ పడవను తయారుచేసింది. డిజిటల్ కెమెరాలను అడ్డుకునే ప్రత్యేక టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. అంటే.. ఇందులో ఉన్నవాళ్లను ఫొటో తీయడం దాదాపు అసాధ్యం అన్నమాట 50 ఏళ్ల బ్రాడ్ పిట్, 39 ఏళ్ల యాంజెలీనా జోలీ ప్రస్తుతం మాల్టాలో ఓ సినిమా షూటింగులో ఉన్నారు. గత నెలలో ఫ్రాన్సులో వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top