'బాహుబలి' ప్రారంభానికి ముందు..!

'బాహుబలి' ప్రారంభానికి ముందు..! - Sakshi


దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన భారీ విజువల్ వండర్ బాహుబలి. ఓ ప్రాంతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించగలదని నిరూపించిన ఈ సినిమా, ప్రస్తుతం సరికొత్త రూపాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బాహుబలి కామిక్ బుక్స్, గేమ్స్ విడుదల కాగా, సాహితీ ప్రియుల కోసం త్వరలో నవల రూపంలో బాహుబలి పాఠకుల ముందుకు రానుంది.



ఈ విషయాన్ని చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ తొలి నవల ముఖ చిత్రాన్ని కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. మూడు భాగాలుగా రిలీజ్ అవ్వనున్న ఈ సీరీస్లో తొలి భాగాన్ని 'ద రైజ్ ఆఫ్ శివగామి' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి కథ ప్రారంభానికి ముందు జరిగిన పరిణామాలను, శివగామి రాజ్యపాలనను ఈ నవల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఆనంద్ నీలకంఠన్ రాసిన ఈ నవల, వెస్ట్ లాండ్, గ్రాఫిక్స్ ఇండియా సంస్థలు పబ్లిష్ చేస్తున్నాయి.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top