మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్
ఓ క్రేజీ ప్రాజెక్ట్ శ్రీకారం దిద్దుకుంది. తెలుగు సూపర్స్టార్ మహేశ్బాబు - తమిళ టాప్ డెరైక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ప్రాజెక్ట్ ఖరారైంది. ‘శ్రీమంతుడు’ ఘనవిజయం తర్వాత మహేశ్బాబు మరిన్ని వైవిధ్యమైన చిత్రాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే ఇకపై ఎటువంటి విరామం లేకుండా వరుసగా సినిమాలు చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మురుగదాస్ చెప్పిన కథ విని ఇంప్రెస్ అయ్యి, మహేశ్ వెంటనే ప్రాజెక్ట్కి పచ్చజెండా ఊపేశారట.
మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ మూవీస్ చేయడంలో మురుగదాస్ సిద్ధహస్తుడు. చిరంజీవితో ‘స్టాలిన్’ తర్వాత మురుగదాస్ డెరైక్ట్గా తెలుగు సినిమా చేయలేదు. ఇక్కడి స్టార్ హీరోలంతా ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తుండటంతో మురుగదాస్, ఇక్కడ సినిమాకు ఓకే చెప్పలేకపోయారు. మహేశ్కి సరిపోయే కథ దొరకడంతో, మురుగదాస్ ఇటీవల మహేశ్ని కలిసి ఈ ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నారు.
ఇద్దరు అగ్ర తెలుగు నిర్మాతలు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కానుందట. ప్రస్తుతం మహేశ్ ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడి కానుంది.