మరాఠీ నుంచి...

మరాఠీ నుంచి...


ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆంధ్రా పోరి’. ఉల్కా గుప్తా కథానాయిక. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై రమేశ్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ మాదిరాజు దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘మరాఠీ లో వచ్చిన ‘టైంపాస్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం.



దర్శకుడు కమిట్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా అందరినీ ఆక ట్టుకుంటుంది’’ అని చెప్పారు. పాల్వంచ, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చే శామని ఆకాశ్ పూరీ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డా.జె, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: ప్రవీణ్ వనమాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top