27న అమితాబ్కు అక్కినేని అవార్డు ప్రదానం

27న అమితాబ్కు అక్కినేని అవార్డు ప్రదానం


హైదరాబాద్ :  ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈనెల 27న అందుకోనున్నారు. ఈ విషయాన్ని అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ శనివారం వెల్లడించింది. 2013 సంవత్సరానికి గానూ అమితాబ్కు అక్కినేని ఫౌండేషన్ ప్రదానం చేయనుంది.



2005 వ సంవత్సరం నుండి భారతీయ సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి అక్కినేని అవార్డును ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పురస్కారం కింది రూ.5 లక్షల నగదుతో పాటు ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు. గతంలో ఈ అవార్డును దేవానంద్, షబానా అజ్మి, అంజలి దేవి, లతా మంగేష్కర్, వైజయంతి మాలా, బాలచందర్, హేమమాలిని, శ్యాం బెనగల్ తదితరులు అందుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top