షూటింగ్లో గాయపడిన హీరోయిన్

షూటింగ్లో గాయపడిన హీరోయిన్ - Sakshi


హైదరాబాద్:   'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ అదాశర్మ షూటింగ్లో గాయపడింది.  ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  హైదరాబాద్లో 'గరమ్' సినిమా షూటింగ్లో పాల్గొన్న  అదాశర్మ  మంగళవారం ప్రమాదవశాత్తూ  బైక్పై నుంచి కిందపడింది.



ఆ సమయంలో  వెనుక నుంచి వస్తున్న బస్సు ఆమెను బలంగా ఢీ కొట్టింది. చిత్ర బృందం హుటాహుటీన అదాశర్మను ఆసుపత్రికి తరలించారు.  కాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి  సమాచారం లేదు. కాగా హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన  అదాశర్మ. సన్ ఆఫ్ సత్యమూర్తి, రాణా విక్రమ సినిమాల్లో కూడా   నటించింది.   కాగా మదన్ దర్శకత్వంలో ఆది, ఆదా శర్మ జంటగా  'గరమ్' చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఆదాశర్మ బాగానే ఉన్నదని, ప్రమాదం అంటూ వచ్చిన వార్తలు రూమర్లే అని ఆమె పీఏ తెలిపింది. ఈ సందర్భంగా ఆదాశర్మ ఈ విధంగా ట్వీట్ చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top