ముంబైకు సోనమ్ కపూర్ తరలింపు
రాజ్కోట్: స్వైన్ ప్లూ బారిన పడిన బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ను ముంబైకు తరలించారు. రాజ్కోట్ లోని స్టెర్లింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను మెరుగైన వైద్యం కోసం ఎయిర్-అంబులెన్స్ లో ఆదివారం ముంబైకి తీసుకెళ్లారు. సోనమ్ తల్లి సునీత ఆమె వెంట ఉన్నారు. సోనమ్ కపూర్ కు స్వైన్ ప్లూ సోకినట్టు శనివారం నిర్ధారించారు.
ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లిన సోనమ్ కు దగ్గు, తీవ్ర జ్వరం రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్ను తీసుకున్నారు. పరీక్షలు ఆమెకు స్వైన్ ఫ్లూ సోకినట్టు వెల్లడైంది. కాగా, గుజరాత్ లో మరో 10 మంది స్వైన్ ప్లూతో మరణించారు. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి 275 మంది మృతి చెందారు.