సెన్సార్‌బోర్డు అవసరమా?


ముంబై: జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్’లో ముద్దుదృశ్యం తొలగింపు వివాదం లో సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహలానీపై బాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 30 సెకన్ల సీన్‌ను 8 సెకన్లకు మార్చినంత మాత్రాన భారతదేశ నీతికి, సంస్కృతికి జరిగిన లాభమేంటో తెలపాలని బజరంగీ భాయ్‌జాన్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ ప్రశ్నించారు.



అసలు సెన్సార్‌షిప్‌నే తొలగించాలని దర్శకుడు శ్యామ్ బెనగల్ డిమాండ్ చేశారు. తనపై వస్తున్న విమర్శలపై నిహలానీ స్పందిస్తూ.. నిబంధనల మేరకే అన్నీ చేస్తున్నామని.. ఎవరైనా అది తప్పని భావిస్తే.. పదవినుంచి తప్పుకునేందుకు సిద్ధమన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top