'ఆగడు'ను ప్రత్యేక ఆస్కార్ కు పంపాలి: వర్మ

'ఆగడు'ను ప్రత్యేక ఆస్కార్ కు పంపాలి: వర్మ

దర్శకుడు శ్రీనువైట్ల, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆగడు' చిత్రంపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆగడు చిత్రంలోని డైలాగ్స్ , డైలాగ్ మాడ్యులేషన్ ని ప్రత్యేక ఆస్కార్ అవార్డుకు పంపాలని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో రాంగోపాల్ వర్మ సూచించారు. 
 
అప్పుడు ప్రపంచ సినిమాను ఆస్కార్ తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అంతేకాకుండా తన కెరీర్ లో ఓ ఉత్తమ పాత్రను ఆగడు చిత్రంలో పోషించే అవకాశాన్ని ప్రకాశ్ రాజ్ కోల్పోయాడని మరో ట్విట్ చేశారు. కోన వెంకట్ అంత అద్బుతమైన డైలాగ్స్ రాస్తారంటే తనకు నమ్మబుద్ది కావడం లేదు. సినిమా టైటిల్స్ తాను చూడలేదు. టైటిల్స్ ను కూడా కోన వెంకట్ రాశారా అంటూ చమత్కరించారు.  తాజా ట్విట్స్ తో శ్రీనువైట్లపై వర్మ ఎన్ కౌంటర్ ప్రారంభించారని స్పష్టంగా అర్ధమవుతోంది. ఎందుకంటే ఆగడు చిత్రంలో వర్మపై ఎక్కువ మోతాదులోనే సెటైర్లు సంధించిన సంగతి తెలిసిందే. 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top