మ్యూజిక్ కంపోజర్ ఆదేష్ శ్రీవాత్సవ మృతి
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఆదేష్ శ్రీవాత్సవ (50) క్యాన్సర్ తో మృతి చెందారు. గత 42 రోజులుగా ముంబైలోని కోకిలాబెన్ ధీరుబాయ్ అంబానీ క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం 12.30 నిమిషాలకు మృతి చెందారు. ఆయన తన 49వ పుట్టిన రోజు జరుపుకున్న మరుసటి రోజే మరణించటం మరింత బాధాకరం. ఐదేళ్ల క్రితం క్యాన్సర్ తో బాధపడిన శ్రీవాత్సవ్ తరువాత కోలుకున్నారు. అయితే ఆ సమయంలో ఎదురైన సమస్యల కారణంగా ఆర్ధికంగా వెనకపడ్డారు.
చాలా రోజులుగా స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నా ఆదేష్ శ్రీవాత్సవ మరోసారి క్యాన్సర్ కు గురయ్యారు. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు.. ఆదేష్ భౌతికఖాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 నిమిషాలకు అంధేరిలోని ఓషివర స్మశాన వాటికలో ఆదేష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చల్తే చల్తే, బాబుల్, బాగ్బన్, కబీకుషి కబీగమ్ లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ను అందించిన ఆదేష్ మృతి బాలీవుడ్ సినీ రంగానికే కాదు సంగీత ప్రపంచానికే తీరని లోటు.