చూసిన పాపానికి.. స్పృహకోల్పోయింది!

చూసిన పాపానికి.. స్పృహకోల్పోయింది!


బీజింగ్‌: కొన్నిసార్లు షాపింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే కొన్ని వస్తువులు విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఆ వస్తువులను కొనడానికి సరిపడేంత డబ్బులేనప్పుడు.. వాటిని కాసేపు పట్టుకొని చూసి అక్కడ పెట్టేసి రావడం చేస్తుంటారు కొందరు. సరిగ్గా ఇలాచేసే ఓ చైనా మహిళ స్పృహతప్పి పడిపోయింది!



యునాన్‌ ప్రావిన్స్‌ రూయిలి పట్టణంలో ఓ షాపులోకి వెళ్లిన మహిళ.. పచ్చరాయితో చేసిన బ్రాస్‌లెట్‌ను చూసి ముచ్చటపడింది. కొనకపోయినా కనీసం చూద్దామని చేతిలోకి తీసుకుంది. అయితే.. అదికాస్తా జారి కిందపడటంతో రెండు ముక్కలైంది. ఈ విషయాన్ని గమనించిన షాప్‌ ఓనర్‌ బ్రాస్‌లెట్‌కు డబ్బు చెల్లించాల్సిందిగా దాని ఖరీదును ఆ మహిళకు చెప్పాడు. అంతే.. ఒక్కసారిగా ఆ మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. కాసేపు ఫిట్స్ వచ్చినట్లు నేలపై పడి కొట్టుకోవడంతో అక్కడివారికి ఏం చేయాలో పాలుపోలేదు.



మొహం మీద కాసిన్ని నీళ్లు చల్లాక లేచి కూర్చున్న ఆ మహిళ.. బ్రాస్‌లెట్‌ రేటు 3,00,000 యువాన్‌లు అని వినగానే స్పృహతప్పానని చెప్పింది. ఆ మహిళ తరఫువారు 70,000 యువాన్‌లు చెల్లిస్తామని చెప్పినా షాప్‌వారు ఒప్పుకోకపోవడంతో.. చివరకు 1,80,000 యువాన్‌లకు బేరం కుదుర్చుకొని పగిలిపోయిన బ్రాస్‌లెట్‌ను పట్టుకెళ్లారు.




Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top