జపాన్ లో మంచు తుపాను:11 మంది మృతి


టోక్యో:జపాన్ లో ఏర్పడ్డ మంచు తుపానుతో భయానక వాతావరణం చోటు చేసుకుంది. మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ 11 మంది పైగా మృతి చెందినట్లు తాజాగా వెల్లడించిన ఓ ప్రకటనలో స్పష్టమైంది. వీరిలో 79 ఏళ్ల వృద్ధుడు ఒకరు మృతి చెందగా, మంచును శుభ్రం చేస్తుండగా 29 ఏళ్ల యువకుడు కూడా మృత్యువాత పడ్డాడు. శీతాకాలంలో ఏర్పడే మంచు తుపానుతో ఇక్కడ వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయని నిపుణలు తెలిపారు.


 


ఈ తరహా వాతావరణం మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా ఉత్తర, మధ్య జపాన్ లో వీచే బలమైన గాలుల కారణంగా వాతావరణంలో మార్పులు చేసుకున్నాయని వారు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top