జర్మనీలో రైళ్లు ఢీ.. పది మంది మృతి


బాడ్ ఐబ్లింగ్: జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో మంగళవారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో పది మంది ప్రయాణికులు మరణించగా సుమారు 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బవేరియాలోని బాడ్ ఐబ్లింగ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి ఓవైపు అడవి మరోవైపు నది ఉండటంతో సహాయ సిబ్బంది బోట్లు, హెలికాప్టర్లలో అక్కడకు చేరుకోవాల్సి వచ్చింది. ప్రమాద కారణాలతోపాటు ఆ సమయంలో రైళ్ల వేగం ఎంతో వెంటనే తెలియరాలేదు. అయితే గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిం చేందుకు రైళ్లకు అనుమతి ఉన్నట్లు అధికారులు చెప్పారు.

 







 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top