ఫోటో తీస్తే.. కన్ను పోయింది!

ఫోటో తీస్తే.. కన్ను పోయింది! - Sakshi


ముద్దుగా ఉన్నాడు కదా అని మూడు నెలల బాబు(వివరాలు గోప్యంగా ఉంచారు)ను దగ్గర్లో నుంచి ఫోటో తీయడంతో ఒక కన్ను పోయింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. తెలిసిన బందువు ఒకాయన మొబైల్ ఫోన్ ఫ్లాష్ ఆఫ్ చేయడం మర్చిపోయి 10 ఇంచుల సమీపంలో నుంచి క్లోజ్అప్లో ఫోటో తీశాడు. ఫ్లాష్ నుంచి వచ్చిన కిరణాలు ఆ పసికందు కుడి కంటిలోని రెటీనా(మక్యులాలోని సెల్)పై దగ్గర నుంచి పడ్డాయి. ఆ తర్వాత బాలుడి కంటి దగ్గర తేడాను గమనించిన తల్లిదండ్రులు వెంటనే డాక్టర్లను సంప్రదించారు. ఫోటో దగ్గర నుంచి తీయడంతో ఫ్లాష్ వెలుతురు పడటంతో కుడి కంటిచూపును శాశ్వతంగా కోల్పొయాడని డాక్టర్లు చెప్పారు. సర్జరీ ద్వారా కూడా ఆ కంటి చూపును తిరిగి తీసుకు రాలేమని స్పష్టం చేశారు. ఈ సంఘటన ప్రభావంతో ఆ పసికందు ఎడమ కంటి చూపు కూడా మందగించిందన్నారు.  

పసి పిల్లల వయసు నాలుగేళ్లు వచ్చే వరకు కంటిలోని మాక్యులా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదని, అప్పటి వరకు ఎలాంటి బలమైన కాంతికిరణాలను కంటిలో పడకుండే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top