స్పెయిన్‌లో ఉగ్రదాడి

స్పెయిన్‌లో ఉగ్రదాడి


మాడ్రిడ్‌ :

స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఫుట్‌ పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న వారిని వ్యానుతో ఢీ కొట్టారు. పర్యటకులతో నిత్యం రద్దీగా ఉండే రాంబ్లాస్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, పదిమందికి పైగా గాయపడ్డారు. క్షతగ్రాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



ఘటన అనంతరం వ్యాను నుంచి దిగిన ఇద్దరు దుండగులు తుపాకులతో అక్కడే ఉన్న ఓ రెస్టారెంట్‌లోకి చొరబడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top